కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇస్కాన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్యూటీలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ మృతిచెందారు.
కడప జిల్లాలోని ఇస్కాన్ సర్కిల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. అంతటితో ఆగకుండా ఆ పక్కనే డ్యూటీలో ఉన్న ఆర్టీఏ అధికారి కారుపై ఓ లారీ వచ్చి పడింది. దీంతో డ్యూటీలో ఉన్న ఆర్టీఏ శివప్రసాద్, అతని అసిస్టెంట్ కేశవ అక్కడికక్కడే చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.