ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 18 మంది గాయాలు

ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 18 మంది గాయాలు
  • 18 మందికి గాయాలు

చౌటుప్పల్, వెలుగు: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మహిళలకు గాయాలయ్యాయి. తెలంగాణ జాతీయ సమైక్యత వారోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చండూర్​ మండల కేంద్రంలో రెవెన్యూ ఆఫీసర్లు శుక్రవారం ర్యాలీ తీశారు. ర్యాలీకి ఫీల్డ్ అసిస్టెంట్లు, వీబీకేలు, రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లను ఆర్టీసీ బస్సులో తరలించారు.

వారోత్సవాలను  ముగించుకొని తిరిగివస్తుండగా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామ పరిధిలో ఎదురుగా వస్తున్న నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో రెండు బస్సుల్లో కలిపి 80 మంది ప్రయాణికులు ఉన్నారు. సుమారు 18 మంది మహిళలకు గాయాలయ్యాయి. గాయపడినవారిని 108లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.