బైక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

బైక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.  అల్వాల్- శామీర్ పేట మార్గంలో హకీంపేట సీఐఎస్ఎఫ్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు టూ వీలర్ వెహికల్ ను ఢీ కొట్టింది.  ఈ ఘటనలో టూవీలర్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 

 ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతులిద్దర్ని మూసాపేటకు చెందిన తారక్, భీముడిగా గుర్తించారు.   తుర్కపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డ్యూటీకి వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.  ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  మృతదేహాలను పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.