ఏపీలో ఘోర ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు..

ఏపీలో ఘోర ప్రమాదం..  వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు..

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డి గూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు వంతెనపై నుంచి వాగులో పడింది. ఈ దుర్ఘటనలో పదిమంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు  ప్రమాదవశాత్తు జల్లేరు వాగులో పడిపోయింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు  వాగులో పడిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Read More:

జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ

శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్