బ్రిడ్జీ గోడపై ఆగిన RTC బస్సు : కిటికీలోంచి దిగిన ప్యాసింజర్లు

బ్రిడ్జీ గోడపై ఆగిన RTC బస్సు : కిటికీలోంచి దిగిన ప్యాసింజర్లు

ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో జరిగింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఉదయం ఖమ్మం నుంచి మణుగూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఏన్కూరులోని నాగార్జున సాగర్ కాలువపై ఉన్న బ్రిడ్జిని బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. భయంతో బస్సులో ఉన్నవారంతా బస్సుకు మరో పక్కనున్న కిటికీల నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. బస్సు కాలువలో పడకుండా బ్రిడ్జిపైనే ఆగి ఉండడంతో వారంతా ప్రమాదం నుంచి బతికి బయటపడ్డామని అంటున్నారు.