ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 25 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 25 మందికి గాయాలు
  • ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల -తర్నం మధ్యలో ఘటన

ఆదిలాబాద్: ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్నాయి. జైనథ్ మండలం నిరాల-తర్నం మధ్యలో జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గుర్తించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెంటనే తన వాహనాలు ఆపి సహాయక చర్యలు అందించారు. గాయపడిన వారిని తమ వాహనాల్లో రిమ్స్ కి తరలించారు. విషయం తెలియడంతో ఎమ్మెల్యే జోగు రామన్న స్పందించి రిమ్స్ లో చికిత్స పొందుతున్న భాదితులను పరమర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.