నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు .. 7 తులాల బంగారం .. రూ. 2 .50 లక్షలు పోలీసులకు అప్పగింత

నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు .. 7 తులాల బంగారం ..  రూ. 2 .50 లక్షలు పోలీసులకు అప్పగింత

జగదేవ్‌‌పూర్ ( కొమురవెల్లి), వెలుగు: బస్సులో ఓ ప్రయాణికుడు బ్యాగ్ మరిచిపోగా అందులో 7 తులాల బంగారం, రూ. 2.50 లక్షల నగదును ఆర్టీసీ ఉద్యోగులు పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నారు.  సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన  బస్సులో ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బంటు యాదగిరి (72)  తన కూతురు వివాహానికి సంబంధించి బంగారం, డబ్బులు ఉన్న బ్యాగుతో భువనగిరి నుంచి జగదేవపూర్ మండలంలోని ఇంద్రనగర్‌‌‌‌ గ్రామానికి బస్సులో వచ్చారు. 

 తన బ్యాగు బస్సులో మరిచిపోయి బస్సు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి జగదేవపూర్‌‌‌‌లో  బస్సు డ్రైవర్ సలీం, కండక్టర్ ఓం ప్రకాశ్ ఇద్దరు బ్యాగును గమనించి పోలీస్ స్టేషన్‌‌లో అప్పగించారు.  కొద్దిసేపటికీ బ్యాగు గుర్తుకు వచ్చి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇచ్చేందుకు రాగా పోలీసులు వృద్ధుడికి పోగొట్టుకున్న బ్యాగ్, బంగారం, డబ్బులు అప్పగించారు.  జగదేవపూర్ ఎస్సై చంద్రమోహన్ ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ ఇద్దరినీ అభినందించారు.