బీజేపీకి అశ్వత్థామ రెడ్డి రాజీనామా

బీజేపీకి అశ్వత్థామ రెడ్డి రాజీనామా

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. బుధవారం ఆయన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. ఏ పార్టీలో చేరే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇటీవల వనపర్తి బీజేపీ అభ్యర్థిగా అశ్వత్థామ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. 3రోజుల తరువాత తాను పోటీ చేయలేనని చెప్పడంతో ఆ సీటును అనూజ్ఞ రెడ్డికి కేటాయించారు.

హరిత నిధికి జీతం కట్ చేసుడేంది

తెలంగాణ హరిత నిధికి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల నవంబర్ జీతం నుంచి రూ.300 కట్ చేస్తూ ఇటీవల ఆర్టీసీ మేనేజ్ మెంట్ సర్క్యులర్ ఇచ్చింది. దీన్ని వెనక్కి తీసుకోవాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి సర్క్యులర్  ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఈవో వికాస్ రాజ్ కు లేఖ రాశారు.