
జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకుడు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్తో ఆసక్తిని పెంచిన టీమ్.. ఆదివారం టీజర్ను రిలీజ్ చేసింది. స్వతంత్రం తర్వాత ఆనాటి తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు టీజర్ ద్వారా అర్ధమవుతోంది. జగపతి బాబు భీం రావు దేశ్ ముఖ్ అనే క్రూరమైన దొర పాత్రలో కనిపిస్తున్నాడు.
‘స్వాతంత్రం మాకే కానీ బానిసలకు కాదు, వాడు బలవంతుడు కావొచ్చు కానీ నేను భగవంతుడిని’ అనే డైలాగ్స్తో పాటు జగపతిబాబు చేసిన యాక్టింగ్తో ఆయన క్యారెక్టర్ ఎంత క్రూయెల్గా ఉంటుందో తెలుస్తోంది. ఇక జ్వాలాబాయి దేశ్ ముఖ్గా మమతా మోహన్ దాస్ కూడా జగపతి పాత్రకు తీసిపోని విధంగా అహంకారంతో కనిపిస్తోంది. మొత్తానికి టీజర్తో సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. మే 26న సినిమా రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.