వాట్సప్ గ్రూప్ లో మెస్సేజ్ ..కనిపించకుండా పోయిన ఎస్సై

వాట్సప్ గ్రూప్ లో మెస్సేజ్ ..కనిపించకుండా పోయిన ఎస్సై

కర్నూలు జిల్లా పోలీసు వాట్సప్ గ్రూప్ లో ఎస్సై మెస్సేజ్ కలకలం రేపుతోంది. ఇదే లాస్ట్ మెస్సేజ్ అంటూ శనివారం రాత్రి రుద్రవరం ఎస్ ఐ విష్ణు నారాయణ  మెస్సేజ్  పెట్టి  కనిపించకుండా పోయారు.  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని  హెడ్ క్వార్టర్ కు రమ్మని ఉన్నతాధికారులు పిలిచారు. దీంతో మనస్తాపం చెందిన ఎస్ ఐ విష్ణు నారాయణ  గ్రూప్ లో మెస్సేజ్ పెట్టారు. ఈ మెస్సేజ్ చూసిన ఎస్పీ అర్థరాత్రి ఎస్ ఐ ఇంటికి వెళ్లి సముదాయించారు. అయితే ఇవాళ ఉదయం నుంచి ఎస్ ఐ కనిపించకుండా పోయారు. ఎస్ ఐ నారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.