
అఫ్గానిస్థాన్కు భారత రాయబారిగా రుద్రేంద్ర టాండన్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రుద్రేంద్ర టాండన్ 1994 బ్యాచ్కు చెందిన ఫారెన్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఆయన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ASEAN) కు భారత రాయబారిగా సేవలు అందిస్తున్నారు. టాండాన్ త్వరలోనే నూతన బాధ్యతలు చేపడుతారని విదేశాంగశాఖ తెలిపింది.