
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. “ఆదిపురుష్” ట్రైలర్ కి సంబంధంచిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. రామాయణ గాధ ఆధారంగా వస్తున్న ఈ సినిమా కోసం.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రామునిగా కనిపిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది.
బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ భారీ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. ఇందులో బాగంగానే ట్రైలర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
అదేటంటే.. మేకర్స్ ఈ ట్రైలర్ కట్ ని సుమారు 3 నిమిషాల 22 సెకంన్లు ఉండేలా సెట్ చేశారట. ఈ ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో, విజువల్ ట్రీట్ గా ఉండమబోతుందట. టీజర్ విషయంలో జరిగిన మిస్టేక్స్ మల్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారట మేకర్స్. మరి ఈ ట్రైలర్ ని కూడా థియేటర్స్ లో.. మెయిన్ గా 3డి వెర్షన్ లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.