రుణమాఫీ విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోంది: మంత్రి ఉత్తమ్​

రుణమాఫీ విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోంది: మంత్రి ఉత్తమ్​

స్వతంత్య్ర భారతదేశంలో  తెలంగాణలో రేవంత్​ ప్రభుత్వం రూ. 2 లక్షలు రుణమాఫీ చేసిందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. రైతులను రుణ విముక్తి చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. రుణమాఫీ విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. వివిధ కారణాలతో రుణమాఫీ జరగని రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందన్నారు.. ఈ సారి నుంచి సన్న వడ్లకు రూ. 500 బోనస్​ ఇస్తామన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. డేటా క్లియర్​ గా ఉన్న వారికి ఇప్పటికే రుణమాఫీ చేశామన్నారు. 

రైతుల  మేలుకోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదన్నారు.  రుణమాఫీపై రైతులను గందరగోళపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు,   గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం క్రాప్​ ఇన్స్యూరెన్స్​ లేకుండా చేసిందన్నారు, గత ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులనే ఆదుకోమన్నా.. ఆదుకోలేదని మంత్రి ఉత్తమ్​ అన్నారు.రుణమాఫీ కోసం ఆధార్​ సవరణలను చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.