కోలుకున్న రూపాయి 19 పైసలు జంప్

కోలుకున్న రూపాయి 19 పైసలు జంప్

న్యూఢిల్లీ: డాలర్​తో పోలిస్తే  రూపాయి గురువారం19 పైసలు లాభపడి రూ.89.96 వద్ద ముగిసింది.  డాలర్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిపోవడం, ఆర్​బీపై జోక్యంతో  కోలుకుంది.  బుధవారం ఇది 90 పైసలు పతనమై రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది.  సెషన్‌‌‌‌ ప్రారంభంలో రూ.90.43 వద్ద సరికొత్త కనిష్ట స్థాయిని తాకింది. విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్​ఐఐలు) అమ్మకాలు, పెరుగుతున్న క్రూడ్ ధరలు ఇందుకు కారణం. ఇండో–-యూఎస్​ వాణిజ్య ఒప్పందం ప్రకటనలో జాప్యం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచింది. 

అయితే అమెరికన్ నాన్-ఫార్మ్ పేరోల్ డేటా అంచనా కంటే తక్కువగా రావడంతో డాలర్ బలహీనపడింది. దీంతో రూపాయికి మద్దతు దొరికింది.  ఈ విషయమై చీఫ్​ ఎకనామిక్​ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, రూపాయి పతనం ద్రవ్యోల్బణం, ఎగుమతులను ప్రభావితం చేయబోదని అన్నారు. వచ్చే ఏడాది పరిస్థితి బాగుంటుందని చెప్పారు. రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతిదారులకు అధికం ఆదాయం వస్తుంది కానీ దిగుమతుల ఖర్చును పెంచుతుంది.