నిజామాబాద్ రూరల్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం మోపాల్ మండలంలో పర్యటించారు. కులాస్పూర్ పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం మోపాల్ మండల కేంద్రంలో కురుమ సంఘం భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
మంచిప్ప గ్రామంలో నిర్మించిన హెల్త్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ద్యేయంగా కాంగ్రెస్ సర్కార్పని చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఒర్వలేక విషపు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు నమ్మొద్దన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు మోహన్రెడ్డి, రాజేశ్, సాయిరెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
