నేషనల్ కబడ్డీ పోటీలకు గ్రామీణ స్టూడెంట్ ఎంపిక

నేషనల్ కబడ్డీ పోటీలకు గ్రామీణ స్టూడెంట్ ఎంపిక

అయిజ, వెలుగు: మండలంలోని మేడికొండ గ్రామానికి చెందిన ఈడిగ వెంకటేశ్ గౌడ్ కుమార్తె శిరీష అండర్ 18 విభాగం కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి నేషనల్ పోటీలకు ఎంపికైంది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో  ఈ నెల 11 నుంచి 24 వరకు అండర్ 18 విభాగం బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచి నేషనల్ లెవెల్ పోటీలకు ఎంపికైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లో ఈనెల 28 నుంచి జూలై 1 వరకు జరిగే పోటీల్లో శిరీష పాల్గొననుంది.శిరీష ధరూర్ మండలం గూడ్డెం దొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నేషనల్ లెవెల్ కబడ్డీ పోటీలకు ఎంపికవడం పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.