కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సెంట్రల్ఉక్రెయిన్స్పై రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 17 మంది చనిపోయారని, 90 మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్అధికారులు తెలిపారు. క్యాపిటల్ సిటీ కీవ్ కు నైరుతిలో 268 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నిట్సియాలో మూడు మిస్సైళ్లు ఓ ఆఫీస్బిల్డింగ్ ను ఢీకొట్టాయని, ఆ దాడుల ప్రభావానికి చుట్టుపక్కల నివాస భవనాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. మిస్సైళ్ల దాడుల వల్ల భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని, 50 కార్లు కాలిపోయాయని చెప్పారు. అయితే తమ దేశ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ లు నాలుగు రష్యా మిస్సైళను ధ్వంసం చేశాయని తెలిపారు. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. మిలిటరీ నీతి పాటించకుండా తమ పౌరులపై రష్యా దాడులు చేస్తోందని, ఇది టెర్రరిజమేనని ఆయన ఆరోపించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉందని, తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేస్తోందని జెలెన్స్కీ మండిపడ్డారు. ‘‘రష్యా ప్రతిరోజూ మా పౌరులను చంపుతోంది. దాడుల్లో పిల్లలు కూడా చనిపోతున్నారు. మిలిటరీ టార్గెట్లు లేని చోట మిస్సైళ్లతో దాడులు చేయడం టెర్రరిజం కాకపోతే మరేమవుతుంది” అని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్లో రష్యా దాడులు, యుద్ధ నేరాలపై దర్యాప్తు చేసేందుకు ద హేగ్లో40 దేశాల ప్రతినిధులు భేటీ అయినప్పుడే రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడింది.