డోన్బాస్ పై రష్యా క్షిపణుల దాడి

డోన్బాస్ పై రష్యా క్షిపణుల దాడి

క్రెయిన్ లోని మరియుపోల్ సిటీని స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ఇప్పుడు ఈస్ట్ లోని పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్ పై గురిపెట్టాయి. డోన్బాస్ పై రష్యా దళాలు క్షిపణుల వర్షం కురిపించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడికి దిగాయి. డోన్బాస్ లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అధికంగా ఉండటం పుతిన్ సైన్యానికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు నిపుణులు.

మరోవైపు లుహాన్ స్క్ ప్రావిన్స్ లోని మెయిన్ సిటీ సీవిరోడోంటెస్క్ లో పాగా వేసేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. డోన్బాస్ లోని డోంటెస్క్ ప్రావిన్స్ లో బాంబు దాడుల్లో ఏడుగురు చనిపోగా.. 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. బొహారోడిచిన్ గ్రామంలోని ఓ చర్చిలో తలదాచుకుంటున్న 100 మంది మత పెద్దలు, పిల్లలను ఖాళీ చేయించారు అధికారులు. మరియుపోల్ అజోవ్ స్టీల్ ప్లాంట్ నుంచి 2 వేల 500 మంది ఉక్రెయిన్ సైనికులను ఖైదీలుగా అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు సైనికుల కుటుంబ సభ్యులు.

డోన్బాస్ లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. రష్యా సేనలను ఉక్రెయన్ దళాలు తప్పనిసరిగా ఓడిస్తాయన్నారు. రష్యా దండయాత్రతో తమ దేశాన్ని సాధ్యమైనంత త్వరగా యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేర్చుకోవాలని మరోసారి కోరారు. ఈ విషయంలో ఈయూలోని 27 సభ్య దేశాలు వెంటనే చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఈయూలో ఉక్రెయిన్ చేరికకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఫ్రాన్స్ మంత్రి క్లెమెంట్ వెల్లడించారు.

సిరియా నుంచి రష్యాకు మద్దతుగా 50 మంది బ్యారెల్ బాంబు నిపుణులు వచ్చినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి. పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడా కీవ్ లో పర్యటించారు. ఉక్రెయిన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసింగించారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు విజయం దక్కదని చెప్పారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ పార్లమెంటులో మాట్లాడిన తొలి విదేశీ నేత అండ్రెజ్ డుడానే. 

మరిన్ని వార్తల కోసం..

ఖుషి నుంచి న్యూ అప్ డేట్

దళితుడు నోట్లోని ఆహారాన్ని తీయించి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే