రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..

రైల్వేలో మేనేజర్ పోస్టులు..  బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్​వీఎన్ఎల్) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 13. 

  • పోస్టుల సంఖ్య: 12
  • పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటీ అండ్ ఎస్ అండ్ టీ/ బీడీ) 02, మేనేజర్ (ఎస్ అండ్ టీ) 05, డిప్యూటీ మేనేజర్ (ఎన్ అండ్ టీ) 05.
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలో బి.టెక్/ బీఈ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
  • వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్​కు 45 ఏండ్లు, మేనేజర్​కు 40 ఏండ్లు, డిప్యూటీ మేనేజర్​కు 35 ఏండ్లు ఉండాలి. 
  • అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా ప్లేస్, ఆర్ కేపురం, న్యూఢిల్లీ–110066 చిరునామాకు అప్లికేషన్ పంపించాలి. 
  • లాస్ట్ డేట్: ఆగస్టు 13. 
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు లేదు. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు rvnl.org వెబ్​సైట్​లో సంప్రదించగలరు.