
పుదుచ్చేరి: దేవధర్ ట్రోఫీలో రియాన్ పరాగ్ (68 బాల్స్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో102 నాటౌట్) మరో మెరుపు సెంచరీకి తోడు మణిశంకర్ మురాసింగ్ (5/28) ఐదు వికెట్లతో సత్తా చాటడంతో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఈస్ట్ జోన్ 157 రన్స్ తేడాతో వెస్ట్ జోన్పై ఘన విజయం సాధించింది. తొలుత పరాగ్, కుమార్ కుశాగ్ర (53), ఉత్కర్ష్ సింగ్ (50) రాణించడంతో ఈస్ట్ జోన్ 50 ఓవర్లలో 319/7 స్కోరు చేసింది. ఛేజింగ్లో వెస్ట్ జోన్ 34 ఓవర్లలో 162 రన్స్కే కుప్పకూలింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ (92) ఒంటరి పోరాటం చేశాడు మరో మ్యాచ్లో నార్త్ జోన్ 9 వికెట్ల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ను చిత్తుగా ఓడించింది. తొలుత మయాంక్ మార్కండే (4/14) దెబ్బకు నార్త్ఈస్ట్ 32.1 ఓవర్లలో 101 రన్స్కే ఆలౌటవగా.. నార్త్ జోన్ 12.5 ఓవర్లలోనే 102/1 స్కోరు చేసి గెలిచింది.