
నల్గొండ అర్బన్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఇతర నాయకులపైకి రాళ్లు రువ్వింది బీజేపీ నేతలనేనని రైతుబంధు రాష్ర్ట అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కనగల్ మండల పరిధిలోని జి.ఎడవల్లిలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘పలివెలకు మేం వస్తాం. మీరూ రండి. మీడియా విజువల్స్చూసి ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుందాం’ అని అన్నారు. మొత్తం 30 మంది టీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారన్నారు. బీజేపీ నేతలెవరైనా గాయపడ్డారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్పీఏ నరేశ్కూడా రాళ్లు రువ్వాడన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని, వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ పలివెలలో ఈటల రాజేందర్అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నల్లగొండ మున్సిపల్చైర్మన్ మందడి సైదిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, యుగంధర్రెడ్డి ఉన్నారు.