గత బీఆర్ఎస్ప్రభుత్వ నిర్వాకం వల్లనే నాగార్జునసాగర్ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్స్కీమ్ ప్రాజెక్ట్ టెండర్ప్రక్రియ జరగకుండా చూడాలంటూ కేఆర్ఎంబీకి 2020 జులై 25న నాటి ఈఎన్సీ లేఖ రాశారు. అదే ఏడాది ఆగస్టు 10 నాటికి ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టు టెండర్ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. నిజానికి దానికి ఐదు రోజుల ముందే అంటే ఆగస్టు 5న అపెక్స్కౌన్సిల్మీటింగ్జరగాల్సి ఉంది.
కానీ, ఆ మీటింగ్ను వాయిదా వేయాలంటూ 2020 జులై 30న నాటి చీఫ్సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. ఆగస్టు 20 తర్వాత మీటింగ్పెట్టాలని కోరారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతోనే రాయలసీమ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచేసింది. అపెక్స్ కౌన్సిల్షెడ్యూల్చేసిన రోజు మీటింగ్కు పోయి ఉంటే టెండర్ ప్రక్రియను ఆపి ఉండవచ్చు. కానీ, ఏపీకి సాయం చేయాలనే కేసీఆర్ ఇలా చేశారు. సుప్రీంలో ఉన్న కేసుపైనా నాటి ప్రభుత్వం స్పందన ఇవ్వలేదు’’ అని చెప్పారు.