
రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్నాళ్లు సినిమాకు దూరమైన మెగా మేనళ్లుడు , సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ గాయం నుంచి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఆక్సిడెంట్తో సినిమాలకు కొంత గ్యాప్ రావడంతో.. సాయి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ మూవీ చేస్తున్నాడు. SDT 15 వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. శామ్దత్ షైనుద్దీన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అయితే తాజాగా సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ కోసం మేకర్స్.. బి హైండ్ ద సీన్స్ పిక్చర్ని విడుదల చేశారు. లైట్, షాడో మధ్య పిక్చర్ కనిపిస్తోంది. డీప్ షాడోస్లో మేకర్స్ ఫ్రేమ్ పెట్టినట్టు అర్థమవుతోంది. మూవీ కోసం టీమ్ పడ్డ శ్రమ ఎలాంటిదో దీన్ని బట్టి తెలస్తోంది.
ఆధ్యాత్మిక హారర్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ విలేజ్కి వెళ్లిన హీరో కథే ఈ సినిమా. 'సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతి సింహరసౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే' అంటూ పోస్టర్ మీద రాసిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. హిందూ కాలమానం ప్రకారం 53వ సంవత్సరంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నాయి.
ఇక SDT15 కేవలం 25 రోజుల్లో 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్..సినిమాపై అంచనాలను పెంచేశాయి. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఇది ఫస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ మూవీ కావడంతో... ఆయన ఫ్యాన్స్ తో పాటు, సినీ వర్గాల్లోనూ ఆ ఎగ్జయిట్మెంట్ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆ క్యూరియాసిటీతోనే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.