హాస్పిటల్ నుండి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

హాస్పిటల్ నుండి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

హైదరాబాద్: అపోలో ఆసుపత్రి నుండి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యాడు. రోడ్డు ప్రమాదంలో గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరాడు తేజ్. ఆయనకు 35 రోజుల పాటు చికిత్స అందించారు డాక్టర్లు. పూర్తిగా కోలుకోవటంతో ఇవాళ డిశ్చార్జ్ చేశారు. సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన తేజుకు ఇధి పునర్జన్మ అన్నారు చిరంజీవి. ఇవాళ సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌ సాయి ధరమ్ తేజ్‌ కు బర్త్‌డే విషెస్ తెలిపారు. గత నెల 10వ తేదీన బైక్‌ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌ కు గాయాలైన సంగతి తెలిసిందే.