
సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సుకుమార్ రైటింగ్స్తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించింది.
సాయితేజ్ మాట్లాడుతూ ‘ఈ సక్సెస్ నాదో, మా టీమ్దో కాదు. ఆడియెన్స్ది. గత ఏడాది కొన్ని సినిమాలకు జనాలు రాలేదు. మంచి సినిమాలు తీస్తే కచ్చితంగా చూస్తారనడానికి ‘విరూపాక్ష’ మరో కారణం. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నాడు. సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నా అంది సంయుక్త. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ రుణపడి ఉంటానన్నాడు కార్తీక్ దండు. డైరెక్టర్స్ మారుతి, గోపీచంద్ మలినేని టీమ్కి కంగ్రాట్స్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, నటీనటులు సోనియా సింగ్, అజయ్, బ్రహ్మాజీ, సాయిచంద్ తదితరులు హాజరయ్యారు.