కార్తీక్ కథ చెప్పి థ్రిల్ చేశాడు : సాయి ధరమ్ తేజ్

 కార్తీక్ కథ చెప్పి థ్రిల్ చేశాడు : సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం   ‘విరూపాక్ష’.  సుకుమార్ రైటింగ్స్‌‌తో కలిసి బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఆదివారం ఇందులోని పాత్రలను పరిచయం చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం సుకుమార్ నుంచి కాల్ రావడంతో లవ్‌‌ స్టోరీ అనుకున్నా. కానీ  కార్తీక్ కథ చెప్పి థ్రిల్ చేశాడు. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయ్యాను. సినిమా చూసిన ప్రతీ తల్లి గర్వంగా చెప్పుకుంటారు. హారర్ సినిమా చూడటమే ఓ చాలెంజింగ్. నటించడం ఇంకా పెద్ద చాలెంజ్. వాయిస్ ఓవర్ ఇచ్చిన తారక్‌‌కు స్పెషల్ థ్యాంక్స్’ అని చెప్పాడు. 

‘ఇందులో నేను  నందిని అనే క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర కోసం చెప్పులు కూడా వేసుకోకుండా, ప్రాణం పెట్టి నటించాను’ అని అంది సంయుక్తా మీనన్. ‘ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. దీనికి కథే హీరో’ అన్నారు దర్శక నిర్మాతలు. సునీల్, బ్రహ్మాజీ, సాయిచంద్, అభినవ్, అజయ్, శ్యామల తదితరులు  పాల్గొన్నారు.