ఏప్రిల్‌‌‌‌ 21న విరూపాక్ష  

ఏప్రిల్‌‌‌‌ 21న విరూపాక్ష  

సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరూపాక్ష’. సుకుమార్‌‌‌‌ రైటింగ్స్‌‌‌‌తో కలిసి బీవీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ వాయిస్‌‌‌‌తో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చి 1న టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు ఆదివారం ప్రకటించారు. ‘ఇక వెయిటింగ్‌‌‌‌లు ఉండవు.. ఓన్లీ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌’ అంటూ టీజర్ రిలీజ్‌‌‌‌డేట్‌‌‌‌ను ట్వీట్ చేశాడు సాయిధరమ్ తేజ్. సంయుక్తా మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. 1990 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో అడవికి సమీపంలోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడి వింత పరిస్థితులను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌‌‌‌ 21న విడుదల చేయనున్నారు.