అధికారుల అండతో మా ప్లాట్లు కబ్జా చేసిన్రు .. సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ బాధితులు ఆవేదన వ్యక్తం

అధికారుల అండతో మా ప్లాట్లు కబ్జా చేసిన్రు .. సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ బాధితులు ఆవేదన వ్యక్తం

సిద్దిపేట టౌన్, వెలుగు: కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను అధికారుల అండతో కాంగ్రెస్ నాయకుడు ఆలకుంట మహేందర్ కబ్జా చేసి, తమపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో బాధితులు మద్దెల నారాయణ, కొండ రమేశ్, మేడిశెట్టి నర్సింలు, బేతి యాదగిరి, మాణిక్యరావు మాట్లాడారు. మహేందర్ సర్వే నంబర్​2000 లోని స్థలంపై చేసిన వ్యాఖ్యలన్నీ పూర్తి అవాస్తవాలని పేర్కొన్నారు.

 తాతల కాలం నుండి ఆయన ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని చెప్పడం అబద్ధమన్నారు. 1995లో ఈ సర్వే నంబర్ లోని సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేశామని, అప్పటినుంచి తామే కబ్జాలో ఉన్నామని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని కోరారు.