ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ టీమ్ రిక్వెస్ట్.. ఆవార్తలు నమ్మకండి

ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ టీమ్ రిక్వెస్ట్.. ఆవార్తలు నమ్మకండి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తమ ఆశలన్ని సలార్ మూవీపైనే పెట్టుకున్నారు. దానికి ఏకైక కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ తో బాక్సాఫీస్ వద్ద సన్సెషన్ క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్.. తన ఆతరువాతి సినిమాని ప్రభాస్ తో చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుండి రిలీజైన లీకుడ్ ఫోటోస్ కూడా సినిమాపై హైప్ ను మరింత పెంచేసాయి.

శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని..హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తోంది. అయితే.. కొద్ది రోజులుగా సలార్ వాయిదా పడింది అంటూ ఒక న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ రూమర్స్ పై సలార్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. "సలార్ వాయిదా అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ రూమర్స్ నమ్మకండి. మా మీద విశ్వాసం ఉంచండి. విడుదల తేదీ మారదు. వరల్డ్ వైడ్‏గా 2023 సెప్టెంబర్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ టెన్షన్ లో ఉన్నాడు. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ గాధ  ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనున్నారు.