
ఎయిడెడ్ స్కూళ్లకు ప్రభుత్వం రూ. 26 కోట్ల 91లక్షల నిధులను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఎయిడెడ్ ఉద్యోగులు ఈ ఏడాది మూడో త్రైమాసికం వరకు రెండు నెలల జీతాలు పొందే అవకాశం కలిగింది. ఎయిడెడ్ స్కూళ్లలో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ జీతాల ఇబ్బంది తొలిగినైట్టెంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.