పియర్సన్తో సేల్స్ ఫోర్స్ ఒప్పందం

పియర్సన్తో సేల్స్ ఫోర్స్ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: పియర్సన్​ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేల్స్​ఫోర్స్​ సర్టిఫికేషన్​ పరీక్షలకు ప్రత్యేక ప్రొవైడర్​గా నిలిచింది. ఈ భాగస్వామ్యం ద్వారా,  నైపుణ్యం కలిగిన మానవ వనరులతో గ్లోబల్​ వర్క్​ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేస్తామని తెలిపింది. ఉద్యోగుల, సంస్థల నైపుణ్యాలను పెంచడానికి పియర్సన్​, సేల్స్​ఫోర్స్​ కలిసి పని చేస్తున్నాయి. ఇందుకోసం కొత్త సర్టిఫికేషన్​ విధానాన్ని అమలు చేస్తాయి.

పియర్సన్​2025 రిపోర్ట్​ ప్రకారం, సర్టిఫికేషన్​ పొందిన నిపుణులలో 70 శాతం మంది తమ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. 63 శాతం మంది పదోన్నతి పొందామని లేదా పొందబోతున్నామని చెప్పారు. పియర్సన్​ వీయూ 80 సేల్స్​ఫోర్స్​ సర్టిఫికేషన్​ పరీక్షలను ఆన్​లైన్​, ఇన్​-పర్సన్,​  ఈవెంట్​-బేస్డ్​ ఫార్మాట్లలో అందిస్తుంది. ఈ పరీక్షలలో సేల్స్​ఫోర్స్​ అడ్మినిస్ట్రేటర్​, ఏజెంట్​ఫోర్స్​ స్పెషలిస్ట్​ వంటివి ఉన్నాయి.