
హైదరాబాద్, వెలుగు: సేల్స్ఫోర్స్ సంస్థ ట్రైల్బ్లేజింగ్ మహిళా సదస్సును హైదరాబాద్లోని తన ఆఫీసులో ఆదివారం నిర్వహించింది. ఉమెన్ లీడర్లు మరింత ఎదిగేలా చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని సంస్థ ప్రకటించింది. విభిన్న విభాగాలకు చెందిన మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇబ్బందికర సమయాల్లో వ్యవహరించడం, నాయకత్వం, కలుపుకుని పోవడం గురించి మాట్లాడారు.
బీట్రూట్ న్యూస్ ఫౌండర్ ఫాయే డిసౌజా, సేల్స్ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతీ భట్టాచార్య మార్పు కోసం నినదించాల్సిన అవసరం గురించి చర్చించారు. జెన్పాక్ట్ సీఈఓ, విద్యా రావు, మహీంద్రా గ్రూప్ సీఐఓ,రుచా నానావతి, బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంట్రీహెడ్ అల్పనా సింగ్ వంటి పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.