ట్రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదస్సును నిర్వహించిన సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ట్రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదస్సును నిర్వహించిన  సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ ట్రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహిళా సదస్సును హైదరాబాద్​లోని తన ఆఫీసులో ఆదివారం నిర్వహించింది.  ఉమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు మరింత ఎదిగేలా చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని సంస్థ ప్రకటించింది. విభిన్న విభాగాలకు చెందిన మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఇబ్బందికర సమయాల్లో వ్యవహరించడం,  నాయకత్వం,  కలుపుకుని పోవడం గురించి మాట్లాడారు. 

బీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్​ ఫాయే డిసౌజా, సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా సీఈఓ అరుంధతీ భట్టాచార్య  మార్పు కోసం నినదించాల్సిన అవసరం గురించి చర్చించారు.  జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సీఈఓ, విద్యా రావు, మహీంద్రా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సీఐఓ,రుచా నానావతి, బజాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలయన్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రీహెడ్​ అల్పనా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.