జైలు నుంచే ఆజంఖాన్ నామినేషన్ దాఖలు

జైలు నుంచే ఆజంఖాన్ నామినేషన్ దాఖలు

సమాజ్ వాదీ పార్టీ (SP)కీలక నేత ఆజంఖాన్ జైలు నుంచే నామినేషన్ పేపర్లను దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాంపూర్ సదర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భూకబ్జాలతో పాటు ఇతర ఆరోపణలపై 2020 ఫిబ్రవరి నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. ఆజంఖాన్ నామినేషన్ వేసినట్టు ఆయన చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్ ఆసిం రజా తెలిపారు. ఆజంఖాన్ ను బెయిల్ పై బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
 
మరోవైపు ఇదే విషయంపై  బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు. ఆజంఖాన్ కు కోర్టు బెయిల్ నిరాకరించినా.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో మాఫియా డాన్ లు తాము చట్టానికి అతీతమని భావిస్తుంటారని.. నేరగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారని... యోగి సీఎం అయిన తర్వాత వీరంతా భయంతో కాలాన్ని వెళ్లదీస్తున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

అఖిలేశ్​ను గెలిపిస్తే మళ్లీ గూండా రాజ్‌ తెచ్చుకున్నట్టే