ఫుల్ బిజీ అయిన సమంత.. కారణం ఏంటంటే..

ఫుల్ బిజీ అయిన సమంత.. కారణం ఏంటంటే..

మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత.. ఓవైపు షూటింగ్స్, మరోవైపు ప్రమోషన్స్‌‌‌‌తో తిరిగి ఫుల్ బిజీ అయింది. ‘సిటాడెల్’ వెబ్‌‌‌‌సిరీస్‌‌‌‌ ఓ షెడ్యూల్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ను పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం ‘ఖుషి’ షూటింగ్‌‌‌‌లో పాల్గొంటోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌‌‌‌ కేరళలోని అలెప్పీలో జరుగుతోంది. విజయ్, సమంత జంటపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

సమంత ఫస్ట్ మూవీ ‘ఏ మాయ చేశావె’లో కొన్ని సీన్స్‌‌‌‌ ఇదే ప్రాంతంలో తీశారు. అదీకాక తన తల్లి సొంతూరు అలెప్పీనే. అందుకే ఈ ప్లేస్‌‌‌‌తో ఆమెకు స్పెషల్ బాండింగ్ ఉంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’ మలయాళంలోనూ విడుదల అవుతున్న సందర్భంగా శనివారం కొచ్చీలో ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. నటనలో చాలామంది మలయాళీ యాక్టర్స్ తనకు ఇన్‌‌‌‌స్ఫిరేషన్ అని, మలయాళ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే.. కచ్చితంగా భాష నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతానని అంది సమంత. మొత్తానికి ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న ఆమె, త్వరలోనే మలయాళంలోనూ స్ట్రయిట్ సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.