ఏమాయ చేసావే విడుదలై 13 ఏళ్ళు ..థ్యాంక్స్:సమంత

ఏమాయ చేసావే విడుదలై 13 ఏళ్ళు ..థ్యాంక్స్:సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్ స్టాలో పోస్ట్‌ పెట్టింది. 'గడిచే ప్రతి రోజు వేసే ముందడు మీ పేమ, అభిమానం వలనే. ఈ ప్రేమ రోజూ నాకు మంచి చేస్తుంది. ఇక నన్ను తరచుగా ఇబ్బంది పెట్టే విషయాలు... ఇకపై ఏం చేయలేవు. కేవలం ప్రేమ కృతజ్ఞతా భావం ఉంటే చాలు.. థాంక్యూ' అని  కామెంట్ పెట్టింది. మీ ప్రేమాభిమానాలు తోడుంటే నన్ను బాధించే అంశాలు ఏమీ చేయలేవని సమంత అన్నారు. నాపై ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే, కొత్త విషయాలను పరిచయం చేస్తోన్న ప్రతిరోజుకూ కృతజ్ఞతలు అని సామ్ చెప్పింది.

కాగా, సమంత నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే విడుదలై 13 ఏళ్ళు అవుతుంది. నాగ చైతన్య హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఇందులో సామ్‌ జెస్సీ పాత్రలో నటించి మెప్పించారు. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా సామ్‌ - చై జంట ప్రేక్షకులను మాయలో పడేసింది. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన ఈ జోడీ.. 2017లో వివాహం చేసుకుంది. 2021లో విడిపోయారు. ప్రస్తుతం సామ్‌ నటించిన ‘శాకుంతలం’ మూవీ విడుదలనకు సిద్ధంగా ఉంది. ‘సిటాడెల్‌’ అనే బాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.