
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన సినిమా ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తోపాటు సమంత కూడా పాల్గొంది. చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ ఈవెంట్ లో సమంత భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ..ఈ సినిమాకు సమంత నిజమైన హీరో అంటూ కొనియాడారు. దీంతో ఆమె ఎమోషనల్ అయింది.
అనంతరం మాట్లాడిన సమంత.. ‘ఈ సినిమా చూశాక నాపై మరింత అభిమానం పెరుగుతుంది. ఓపిక లేకపోయినా ఈవెంట్కు వచ్చానని’ తెలిపింది. కాగా, సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధి భాదపడుతోంది. దీనికి చికిత్స కూడా తీసుకుంటుంది. ఇప్పడిప్పుడే ఆమె ఈ వ్యాది నుంచి కోలుకుంటుంది. ఇక ‘శాకుంతలం’ మూవీని గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.