సౌత్ బ్యూటీ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటివరకు మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన ఆమె ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి కోలుకొని సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన ఖుషీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఆమె బాలీవుడ్ లో హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీమేక్ లో నటిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Meeting her and taking pics with her is a dream ❤
— HaRshi 🧚♀ (@Harshi_74) March 24, 2024
Finally on 23-03-2024 I met my Favourite Actress and interacted with her like a friend 💗
Will cherish this memorable moment everyday in my life. Thank you @Samanthaprabhu2 for your time ❤️❤️ I love you ✨ #SamanthaRuthPrabhu pic.twitter.com/nYYFSYbeNy
ఇదిలా ఉంటే.. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫీల్ యాక్టీవ్ గా ఉండే ఆమె తాజాగా ఫ్యాన్స్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తన అభిమానులను కలుసుకుంది సమంత. ప్రేమతో వారు తెచ్చిన గిఫ్టులను కూడా అందుకుంది. అయితే అందులో ఒక అభిమాని సమంతను చూడగానే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఆ అభిమానిని దగ్గరకు తీసుకున్న సమంత కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఫ్యాన్స్ తో కలిసి కేక్ కూడా కట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెతో ప్రేమగా ఫోటోలు దిగిన అభిమానులు కేసుల వాటిని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంతపై తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.