‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది సమంత. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. సామ్పై టాలీవుడ్ డైరెక్టర్ శివనాగేశ్వర్రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘సమంత సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఓ సినిమా ఆడిషన్ కోసం ఆమెను హైదరాబాద్ పిలిపించాం. అదే రోజు తిరిగి చెన్నై పంపిద్దామంటే ఫ్లైట్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి.
మరుసటి రోజు వరకు ఆగాలని కోరాం. ఆమె వినకపోవడంతో అదేరోజు పంపించేశాం. తన ఆడిషన్ నచ్చి సినిమా ఆఫర్ చేస్తే.. రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసింది. మా దగ్గర అంత బడ్జెట్ లేక ఆగిపోయాం. లేకపోతే ఆమెను నేనే టాలీవుడ్కి పరిచయం చేయాల్సిన వాడిని’ అంటూ ఈ దర్శకుడు తెలిపాడు. మనీమనీ, సిసింద్రి వంటి హిట్స్కు ఈయన దర్శకత్వం వహించారు.