శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో సమంత సెన్సేషనల్ కామెంట్స్

శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో సమంత సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, సినీ నటి సమంత అసలు ఎందుకు విడిపోయారు. ఏమైంది ..వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణాలేంటీ అన్న వార్తలు మొన్నటివరకూ ఓ ప్రశ్నల్లానే మిగిలాయి. తాజాగా ఈ విషయంపై సామ్ క్లారిటీ ఇచ్చారు. తన తప్పేం లేదని, తన సైడ్ నుంచి 100శాతం ఇచ్చినా.. వర్కవుట్ కాలేదని తేల్చి చెప్పారు. మొదటి సారి తమ విడాకులపై సామ్ స్పందించడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మూవీ టీం ప్రారంభించింది. అందులో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్నారు. మొదటిసారి తన వైవాహిక జీవితం గురించి పెదవి విప్పారు. తన వైవాహిక బంధంలో పూర్తి నిజాయతీగా ఉన్నానుని, తన సైడ్ నుంచి ఎలాంటి తప్పులేదు, చిన్న పొరపాటు కూడా లేదని సమంత స్పష్టం చేశారు. ఆ బంధం వర్కౌట్‌ కాలేదన్నారు. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే తనకు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊ అంటావ పాట ఆఫర్‌ వచ్చిందన్న సమంత.. మొదట తాను సుకుమార్ గారికి నో అనే చెప్పానని, కానీ ఆ తర్వాత ఆలోచించి ఓకే చెప్పానన్నారు.

అయినా తానేం తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంట్లో ఉండాలి.? అందుకే ఆ పాట చేశానని సామ్ తేల్చి చెప్పేశారు. ఊ అంటావా పాటను అనౌన్స్‌ చేసినప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవాళ్లు తనకు ఫోన్లు చేసి తిట్టారన్నారు. నువ్వు ఇంట్లో కూర్చో చాలు... విడిపోయిన వెంటనే నువ్వు ఇలా ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తే అస్సలు బాగోదు అంటూ ఉచిత సలహాలు ఇచ్చారని చెప్పారు. తమ- వైవాహిక బంధంలో 100 శాతం నిజాయతీగా ఉన్నానన్న సామ్.. తానేదో నేరం చేసిన దాన్నిలాగా ఎందుకు దాక్కోవాలి అని ప్రశ్నించారు. అందుకే ఆ పాట చేశానని వివరించారు.