ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పిన సమంత

ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పిన సమంత

టాలీవుడ్ బ్యూటీ సమంత కథానాయికగా నటించిన చిత్రం ‘యశోద’. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను, తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి సామ్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ షేర్ చేసింది. ‘యశోద’ చిత్రాన్ని సూపర్‌ సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు, తన అభిమానులకు సమంత ధన్యవాదాలు తెలిపింది. 

"ప్రియమైన ప్రేక్షకులకు 'యశోద' పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.'యశోద' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. 'యశోద' మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. 

నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు.వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది" అంటూ..సమంత తెలిపింది.