హోలీ ​సేల్​ ప్రారంభం..శామ్​సంగ్​ లో బంపర్ ఆఫర్లు

హోలీ ​సేల్​ ప్రారంభం..శామ్​సంగ్​ లో బంపర్ ఆఫర్లు

న్యూఢిల్లీ :  కన్జూమర్​ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్​సంగ్​హోలీ సేల్​ను ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌‌టాప్‌‌లు, ట్యాబ్లెట్స్,  వేరబుల్స్, శామ్​సంగ్ టీవీలు, ఇతర డిజిటల్​యాక్సెసరీలపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఆఫర్‌‌లు శామ్​సంగ్​ వెబ్​సైట్​, శామ్​సంగ్​ షాప్ యాప్, శామ్​సంగ్​ ఎక్స్‌‌క్లూజివ్ స్టోర్‌‌లలో అందుబాటులో ఉంటాయి.

ప్రముఖ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌‌లపై కస్టమర్లు గరిష్టంగా 22.5 శాతం క్యాష్‌‌బ్యాక్ (గరిష్టంగా రూ.25,000 వరకు) పొందుతారు. ఈ సేల్​ ఈ నెల 26న ముగుస్తుంది. గెలాక్సీ సిరీస్​ ఫోన్లపై 6‌‌‌‌0 శాతం వరకు, ల్యాప్​టాప్​లపై 45 శాతం తగ్గింపు ఇస్తామని కంపెనీ ప్రకటించింది.  టీవీ కొంటే పాత టీవీని ఎక్స్ఛేంజ్​చేసుకోవచ్చు.