శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్లను ఇండియాలో విడుదల చేసింది. ఆగస్టు 23 నుంచి అందుబాటులోకి రానున్న గెలాక్సీ నోట్ 10 ప్లస్ ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతుండగా.. గెలాక్సీ నోట్ 10 ధర రూ.69,999. గెలాక్సీ నోట్ 10 ప్లస్ 12 జీబీ ర్యామ్,256 జీబీ మెమరీతో, 12 జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీతో అందుబాటులోకి వస్తోంది. నోట్ 10 ఫోన్లో 8జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ ఉంటుంది.
