సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ జనం మార్పును కోరుకున్నారని.. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఓయూలోని సనత్ నగర్ డీఆర్సీ సెంటర్కు వచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సాధారణమన్నారు. బీఆర్ఎస్ సర్కారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గ్రేటర్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించిందన్నారు. సనత్నగర్లో మరోసారి అవకాశమిచ్చిన సెగ్మెంట్ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యేగా తన వంతు పోషిస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఆయన చెప్పారు.