పద్మారావునగర్, వెలుగు: సనత్నగర్నియోజకవర్గంలో పీసీసీ వైస్ప్రెసిడెంట్డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో కాంగ్రెస్141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సనత్నగర్, బీకే గూడ, అమీర్పేట్, ఎస్సార్నగర్, బేగంపేట్, బన్సీలాల్పేట్, పద్మారావునగర్, రాంగోపాల్పేట్ డివిజన్లలో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..1885లో స్థాపించిన కాంగ్రెస్పార్టీ దేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి, అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
విద్యుదీకరణ, ఐఐటీలు, ఎయిమ్స్, బ్యాంకుల జాతీయీకరణ, ఉపాధిహామీ, ఆర్టీఐ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్పాలనలోనే అమలయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా పార్టీదేనన్నారు. ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
