పాల్వంచలో ఇసుక లారీలు సీజ్

పాల్వంచలో ఇసుక లారీలు సీజ్

పాల్వంచ రూరల్​, వెలుగు :  గుట్టుచప్పుడు కాకుండా  అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక లారీలను పాల్వంచ పోలీసులు, మైనింగ్​, ఆర్​టీఏ  అధికారులు గురువారం పట్టుకున్నారు.  భద్రాచలం మీదుగా  హైదరాబాద్​కు అక్రమంగా ఇసుక   తరలిస్తున్నారన్న సమాచారంతో  మైనింగ్​, పోలీస్​ అధికారులు పాల్వంచ  ఆర్​టీఏ చెక్​పోస్ట్ దగ్గర  కాపుకాసి 5 లారీలను పట్టుకున్నారు.   

ఎలాంటి అనుమతులు, వే బిల్లులు  లేకపోవడంతో  వాటిని  సీజ్​ చేసి   పోలీస్​ స్టేషన్​కు తరలించినట్లు రూరల్​ఎస్​ఐ శ్రీనివాస్​ తెలిపారు. అనుమతులు లేకున్నా భారీ ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాకు పొలిటికల్​ సపోర్ట్​ ఉండవచ్చునని. అధికారుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా   ఓవర్​లోడ్ చేసి మరీ రవాణా చేస్తున్నా  అధికారులు   చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.   పట్టుబడిన  5లారీలకు  రూ. 85 వేల చొప్పున  రూ. 4లక్షల 25వేలు జరిమానా   వేసినట్లుతెల్సింది.