మందమర్రి/ నస్పూర్, వెలుగు: ఎడతెరిపిలేని వానలతో సింగరేణి బొగ్గు గనులకు ఇసుక కొరత ఎదురవుతోంది. భారీ వరద కారణంగా ఇసుక తయారు చేసే పీఓబీ (ప్రాసెస్ఓవర్బర్డెన్) ప్లాంట్ నీటమునగడం, గోదావరి నుంచి ఇసుక వెలికితీయలేని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని ఆరు అండర్గ్రౌండ్మైన్లకు 14 రోజులనుంచి ఇసుక సప్లయ్జరగడంలేదు. పీఓబీ ప్లాంట్ తిరిగి ఇసుక తయారీ చేసేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా ఎస్టీపీపీ బాటమ్ యాష్వాడాలని సింగరేణి భావిస్తోంది. ఇసుక సప్లయ్మరింత ఆలస్యం అయితే బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడనుంది. అండర్గ్రౌండ్ మైన్స్లో బొగ్గు వెలికితీసి..ఆ ఖాళీ ప్రదేశాన్ని ఇసుకతో నింపుతుంటారు. దీన్ని శాండ్ స్ర్టవింగ్ మైనింగ్ సిస్టం అంటారు. బొగ్గు వెలికితీసిన ప్రాంతం కూలకుండా, ఆ ప్రాంతంలో ఉత్పత్తి సజావుగా సాగేందుకు ఈ సిస్టం ఉపయోగపడుతుంది.
నీటిలోనే మెషీన్లు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఓసీపీ ఆవరణలో సింగరేణి సహకారంతో ప్రైవేటు కంపనీ రూ.14కోట్ల వ్యయంతో మట్టి నుంచి ఇసుకను తయారు చేసే ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ కంపనీ సప్లై చేసే ఇసుకకు క్యూబిక్ మీటర్ లెక్కన సింగరేణి రేటు కట్టి ఇస్తుంది. ప్లాంట్లో రోజు 1,000 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉత్పత్తిచేస్తారు. ఈ ప్లాంట్ నుంచి శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ-1, ఎస్సార్పీ- 3, ఆర్కే-7, ఇందారం- 1ఏ అండర్ గ్రౌండ్ మైన్లు, మందమర్రి ఏరియాలోని కాసిపేట, కాసీపేట- 2 గనులకు సప్లై చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలవల్ల ప్లాంట్ మునిగిపోయింది. ప్లాంట్కు సంబంధించిన హేవీ మెషీన్లు, కరంటు మోటార్లు, కన్వేయర్బెల్ట్తదితర సామగ్రి, కంట్రోల్ రూం పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. ప్లాంట్ నుంచి నీటిని బయటకు తోడేస్తున్నారు. ప్లాంట్ మునగడంవల్ల భారీ నష్టం వాటిల్లిందని, నీటిని తోడేసిన తర్వాత మెషీన్లు పనిచేస్తాయా, లేదా అన్నది తెలుస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. పీఓబీ ప్లాంట్లోకి వరదనీరు చేరకుండా సింగరేణి, కాంట్రాక్ట్ సంస్థ ముందస్తుగా చర్యలు తీసుకోలేదు. ఎత్తుగా ఉన్న ఓసీపీ డంప్యార్డ్ల దిగువన ప్లాంట్ నిర్మించారు. దీంతో ఎగువన ఉన్న ఓబీ యార్డుల నుంచి వరదంతా ప్లాంట్లోకి చేరింది. వరద నీరు వెళ్లేందుకు ప్లాంట్నుంచి సింగపూర్ గ్రామం వరకున్న వరద కాల్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల మట్టితో నిండిపోయింది. దీంతో వరదనీరు బయటకు వెళ్లక ప్లాంట్లోకి చేరింది.
బాటమ్ యాష్ వినియోగిస్తాం
ఇసుక ప్లాంట్ నీటిలో మునిగినందున ప్రత్యామ్న యంగా సింగరేణి ఎస్టీపీపీ బాటమ్ యాష్ను వినియో గించాలని నిర్ణయించాం. వారం రోజుల్లో ప్లాంట్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దిగువ ప్రాంతంలో ఉన్న ప్లాంట్ను త్వరలో ఎగువన ఉన్న ఓబీ కంపెనీ క్యాంపులోకి మారుస్తాం. - బి.సంజీవరెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం
