జాతీయ అవార్డు అందుకున్న సంధ్యా రాజు

జాతీయ అవార్డు అందుకున్న సంధ్యా రాజు

నాట్యం చిత్రానికిగానూ సంధ్యారాజు బెస్ట్ కొరియోగ్ర‌ఫీ విభాగంలో జాతీయ అవార్డును అందుకున్నారు. భార‌తీయ సంప్ర‌దాయ నృత్యం ఆధారంగా రూపొందిన 'నాట్యం' సినిమా ద్వారా కూచిపూడి డాన్స‌ర్ సంధ్యా రాజు గ‌త ఏడాది సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆమె ‘నాట్యం’ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసి అంద‌రిలోనూ ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.

అలాగే నాటం సినిమా విడుదల తర్వాత విభిన్న చిత్రంగా అందరి మన్ననలు అందుకోవ‌ట‌మే కాదు.. ప్రతిష్టాత్మకమైన 68వ జాతీయ సినీ అవార్డులను దక్కించుకుంది. అయితే ఇవాళ న్యూ ఢిల్లీలో 68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌ధానోత్స‌వం జ‌రిగింది. ఇందులో భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా సంధ్యారాజు అవార్డును అందుకున్నారు. 

సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నాట్యం సినిమా రూపొందింది. డాన్స్ ప్ర‌ధానంగా సాగే క‌థాంశం కావ‌టంతో ఈ సినిమాకు నాట్యం అనే టైటిల్‌ను పెట్టారు. సినిమాను ఎంతో ఆస‌క్తిక‌రంగా.. ఆక‌ర్ష‌ణీయంగా చిత్రీక‌రించారు. క్లాసిక్ డాన్స‌ర్ పాత్ర‌లో సంధ్యా రాజు అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. గురువు, శిష్యుడు మ‌ధ్య ఉండే గొప్ప అనుబంధాన్ని తెలియ‌జేస్తూనే మెప్పించే ప్రేమ‌క‌థా చిత్రంగా నాట్యం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సినీ అభిమానుల హృద‌యాల‌ను దోచుకుంది.