
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు ఉన్న బ్యాగును ఓ ఆటోడ్రైవర్పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అప్పగించాడు. సోమవారం కల్హేర్ మండల కేంద్రానికి చెందిన సంఘవుని శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డిలోని మల్కాపూర్ చౌరస్తాలో ఉన్న బంధువుల శుభకార్యానికి వెళ్లాడు.
నగలు కలిగిన బ్యాగును ఆటోలో మర్చిపోయాడు. బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్ సైక్ ఖదీర్ సంగారెడ్డి టౌన్ పీఎస్లో అప్పగించాడు. శ్రీనివాస్ తన బ్యాగ్ మిస్ అయిన విషయాన్ని గుర్తించి పీఎస్లో ఫిర్యాదు చేయడానికి రాగా అక్కడ తన బ్యాగును గుర్తించి సంతోషం వ్యక్తం చేశాడు. తన బ్యాగును అప్పగించిన ఆటో డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపాడు.