
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా శుక్రవారం ఉదయం నిజపాద సేవ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. మహేష్ బాబుతో పాటు.. చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటీనటులు విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, నిర్మాత దిల్ రాజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక స్వామి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. మహేష్ బాబును టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.