పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. బాంచన్ బతుకులు మనకొద్దు: సరోజా వివేక్

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. బాంచన్ బతుకులు మనకొద్దు: సరోజా వివేక్

కోల్ బెల్ట్, వెలుగు: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బాంచన్ బతుకులు మనకొద్దని, కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ చెన్నూర్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజా వివేక్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని సింగరేణి కార్మిక వాడల్లో కుమారుడు వంశీకృష్ణ, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు  కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, చిన్న కొడుకు బాల్క సుమన్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. అందరం కలిసి కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిద్దాం. అక్కడే వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిద్దాం” అని అన్నారు.

‘‘ఎంపీ, ఎమ్మెల్యేగా పదేండ్లు కొనసాగిన బాల్క సుమన్ మళ్లీ ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇచ్చిన హామీలపై నిలదీయండి. కేసీఆర్ బానిసైన బాల్క సుమన్ ను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టండి” అని పిలుపునిచ్చారు. ‘‘విద్యార్థి నాయకుడిగా చెప్పుకున్న బాల్క సుమన్.. ఆనాడు ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టిండు. ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే యువత మీద అక్రమ కేసులు పెడుతున్నడు” అని మండిపడ్డారు. కాంగ్రెస్​కు ఓటు వేసి గెలిపించాలని బీఆర్​ఎస్​ను ఇంటింకి పంపాలని కోరారు.